ఈ నెల 11న భద్రాచలానికి సీఎం రేవంత్ రెడ్డి

-

మార్చి 11న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రాచలంలో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులు కూడా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామిని దర్శించుకోనున్నారు. ఆ తర్వాత జిల్లా అభివృద్ధిపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. అనంతరం మణుగూరులో జరిగే ‘ప్రజా దీవెన’ సభలో సీఎం పాల్గొంటారు.

ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనపై ఎస్పీ రోహిత్ రాజు, ఐటీడీఏ పీవో తో కలెక్టర్ ప్రియాంక అల ప్రత్యేక సమావేశం నిర్వహించారు.ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version