అగ్నిపధ్ కు వ్యతిరేకంగా రేపట్నుంచి జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్ష

-

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపధ్ కు వ్యతిరేకంగా ఆదివారం నుండి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ పార్టీ సత్యాగ్రహ దీక్ష చేపట్టనుంది. అగ్నిపధ్ స్కీమ్ ను తక్షణం వెనక్కు తీసుకోవాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన సత్యాగ్రహ కార్యక్రమంలో పాల్గొనేందుకు దేశ వ్యాప్తంగా పార్టీ శ్రేణులు శనివారం రాత్రి ఢిల్లీకి చేరుకునేలా ఏర్పాట్లు చేపట్టాలని కాంగ్రెస్ రాష్ట్ర స్థాయి నేతలను అగ్రనాయకత్వం కోరిందని ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

మరోవైపు వివాదాస్పద సాగు చట్టాలను రద్దు చేసిన తరహాలోనే..అగ్నిపధ్ స్కీమ్ ను ఉపసంహరించాలని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ట్విట్టర్ ద్వారా కోరారు. రైతులకు క్షమాపణ చెప్పిన విధంగానే దేశ యువతకు మోడీ మరోసారి క్షమాపణ చెప్పాలని రాహుల్ గాంధీ కోరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version