SLBC టన్నెల్ పనులపై కాంగ్రెస్ పచ్చి అబద్ధాలు : మాజీ మంత్రి హరీశ్ రావు

-

SLBC టన్నెల్ ప్రాజెక్ట్ విషయంలో గత పదేళ్ళలో ఏం పనులు చేయలేదని కాంగ్రెస్ ప్రభుత్వం పచ్చి అబద్ధాలు ఆడుతున్నదని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు వాస్తవాలను పూర్తి ఆధారాలతో సహా బైట పెడుతున్నాం హరీశ్ రావు స్పష్టంచేశారు.

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 2006 నుండి 2014 మే వరకు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన పని 22.890 కిలోమీటర్లు అయితే.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 2014 జూన్ నుండి 2023 వరకు జరిగిన పని 11.482 కిలోమీటర్లు.టన్నెల్ మొదట్లో పనులు వేగంగా అవుతాయి కానీ లోపలికి వెళ్లే కొద్దీ పనుల వేగం తగ్గుతుంది. 2019 తరువాత సీపేజ్ ఎక్కువగా వస్తుండటంతో పనులు మందగించి దాదాపుగా ఆగిపోయాయని మాజీ మంత్రి స్పష్టంచేశారు.

Read more RELATED
Recommended to you

Latest news