CPI MLA Sambasivarao : ఇచ్చిన హామీలను కాంగ్రెస్‌ అమలు చేయాల్సిందే : ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

-

ఎన్నికల్లో గెలిచి అధికారంలో రావడానికి ప్రజలకిచ్చిన హామీలను కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేయాల్సిందేనని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజల కోసమే పని చేయడమే అంతిమ లక్ష్యంగా ఉండాలని ఆయన గుర్తు చేశారు. నాగర్‌ కర్నూల్‌ జిల్లా కేంద్రంలోని సాయి గార్డెన్స్ లో సీపీఐ ఆధ్వర్యంలో కూనంనేని సాంబశివరావును, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డిని,నాగర్‌ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డిని సన్మానించారు.

ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో సాంబ శివరావు మాట్లాడుతూ పేద ప్రజలకు మంచి చేయాలన్నది సీపీఐ సిద్ధాంతం అని అన్నారు. అందుకోసమే గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నామని వెల్లడించారు. ప్రజల కోసం సీపీఐ రాజీలేని పోరాటం చేస్తుందని తెలిపారు. పేదల సమస్యల పరిష్కారము కోసం కమ్యూనిస్టులు అందరూ కలసి ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి,ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు అభివృద్ధి ,సంక్షేమం చేసి చూపించడంలో ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version