మోటార్లకు మీటర్లు పెడితే.. వేళ్లు నరికేయండి – సీపీఐ నారాయణ

-

మోటార్లకు మీటర్లు పెడితే.. వేళ్లు నరికేయండని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు సీపీఐ నారాయణ. ప్రస్తుతం ఏపీలో మోటార్లకు విద్యుత్ మీటర్ల వ్యవహారం వివాదాస్పద అంశంగా మారిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాన్ని జగన్ సర్కార్.. ఏపీలో అమలు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే దీనిని ప్రతిపక్షాలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి.

దీనివల్ల రైతులకు అన్యాయం జరుగుతుందని విపక్షాలు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ అంశంపై సిపిఐ నారాయణ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చిత్తూరు జిల్లాలో నిన్న రైతు సదస్సులో పాల్గొన్న అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం జగన్ పై మండిపడ్డారు. జగన్ తండ్రి వైయస్సార్ రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తే, జగన్ మాత్రం దానిని కాదని మోటార్లకు మీటర్లు బిగిస్తున్నారని ఫైర్ అయ్యారు. రాజన్న పాలన అంటే ఇదేనా అని ఎద్దేవా చేశారు. మోటార్లకు మీటర్లు పెట్టి రైతులను జగన్ ఇబ్బందుల పాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది జగన్ సర్కార్ కు మంచి పద్ధతి కాదని హితువు పలికారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version