వ్యభిచార గృహం పై ఎస్ఓటీ పోలీసుల మెరుపు దాడి

-

వ్యభిచార గృహం పై మహేశ్వరం ఎస్ఓటీ పోలీసులు దాడి చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకొని మీర్ పేట పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన పై మీర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు వెల్లడించిన ప్రకారం.. పంటరిపురం గ్రామం చిలుకలూరి పేట, గుంటూరు జిల్లాకు చెందిన నోసిని సుజాత (35), స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలో ఉద్యోగ్ నగర్ బడంగ్ పేటలో తన ఇంట్లో గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తుంది.

మహేశ్వరం ఎస్ఓటీ పోలీసులు విశ్వసనీయ సమాచారం మేరకు దాడి చేశారు. ఈ దాడుల్లో నిర్వాహకురాలితో పాటు ఇద్దరు విటులు జిల్లెల గూడకు చెందిన కాటి లక్ష్మీనారాయణ (40), సర్దార్ నగర్ తుక్కుగూడకు చెందిన తల్లా ప్రమోద్ (28) ను అదుపులోకి తీసుకొని మీర్ పేట పోలీసులకు అప్పగించారు. వారి వద్ద నుంచి రూ.17,080 నగదు, నాలుగు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version