మెమో ఇవ్వలేదని.. ప్రిన్సిపల్‌పై పెట్రోల్‌ పోసి నిప్పంటించిన విద్యార్థి

-

మధ్యప్రదేశ్​లోని ఇండోర్​లో ఘోరం జరిగింది. మార్కుల మెమో ఇవ్వలేదనే కోపంతో ఓ పూర్వ విద్యార్థి మహిళా ప్రిన్సిపల్​పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. సోమవారం రోజు జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.


ఉజ్జయినికి చెందిన అశుతోష్‌ శ్రీవాస్తవ(24) బీఎం కాలేజ్‌ ఆఫ్‌ ఫార్మసీ పూర్వ విద్యార్థి. గత ఏడాది జులైలో బి ఫార్మాలో ఉత్తీర్ణత సాధించినప్పటికీ మార్కుల జాబితా ఇవ్వలేదనే కోపంతో ప్రిన్సిపాల్‌ విముక్త శర్మ(54)పై పెట్రోల్‌ చల్లి, నిప్పంటించాడు. ఆమె శరీరంపై 80శాతానికి పైగా కాలిన గాయాలయ్యాయని, పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు.

దాడి అనంతరం పారిపోయిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. నాలుగు నెలల క్రితం కూడా అశుతోష్‌ మార్కుల జాబితా విషయమై కళాశాల ప్రొఫెసర్‌తో గొడవపడి కత్తితో దాడి చేసినట్లు తెలిసింది. అయితే, మార్కుల జాబితా ఇంకా తమ కళాశాలకు చేరలేదని యాజమాన్యం వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version