ఎల్బీనగర్ లో నకిలీ నోట్ల, డ్రగ్స్ ముఠా అరెస్ట్

-

తెలంగాణలో నూతన ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలే హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ లేకుండా చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసిన విషయము తెలిసిందే. గత ప్రభుత్వ హయాంలోనే నార్కోటిక్ స్పెషల్ కమిటీని ఏర్పాటు చేశారు. డ్రగ్స్, నకిలీ నోట్లు వంటి వాటిని అరికట్టేందుకు ప్రభుత్వము చర్యలు తీసుకుంటుంది. తాజాగా నగర శివారు ప్రాంతమైనటువంటి ఎల్బీనగర్ లో రెండు ముఠలను పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ నోట్ల చలామణి చేస్తున్న ముగ్గురు ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 60 లక్షల నకిలీ నోట్లు, కారు స్వాధీనం చేసుకున్నారు.

అదేవిధంగా ఎల్బీనగర్ ప్రాంతంలో డ్రగ్స్ విక్రయిస్తున్న మరొక ముఠాను కూడా పోలీసులు ఇవ్వాళ అరెస్టు చేశారు. ఇద్దరు ముఠా సభ్యులను ఎస్ఓటి పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 30 గ్రాముల ఎండిఎంఏ, 2 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version