అర్ధరాత్రి ఓ మహిళపై వైసీపీ నేత లైంగిక దాడి !

-

రోజు రోజు మహిళలపై అగాయిత్యాలు పెరిగి పోతున్నాయి. ఎక్కడా చూడు.. మహిళలపై కామాంధులు లైంగిక దాడికి పాల్పడుతున్నారు. అయితే.. తాజాగా.. ఏపీ లో దారుణం చోటుచేసుకుంది. పెనుగొండ కు చెందిన వైసీపీ ప్రజా ప్రతినిధి, కౌన్సిలర్ శేషాద్రి పట్టణంలోని ఓ మహిళను లైంగికంగా వేధించాడు. ప్రేమిస్తున్నానని ఫోన్లు చేశాడు.

వాటిని ఆమె పట్టించుకోకపోవడంతో అర్ధరాత్రి ఇంటికి వెళ్లి తలుపులు బాదుతూ.. బయటకు రావాలని ఇంటిపై రాళ్లు విసిరారు ఈ కామాంధుడు. అయినా మహిళా లొంగిపోవడంతో ఆక్సిడెంట్ చేసాడు. తరచూ అలాగే వేధిస్తుండటంతో చెప్పులతో కొట్టింది ఆ మహిళ. అయినా ఆ కౌన్సిలర్ అదేవిధంగా వెంట పడడంతో బుధవారం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది ఆ బాధిత మహిళ. పోలీసులు తనకు న్యాయం చేయకుండా ఆత్మహత్య శరణ్యమని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version