హైదరాబాద్ లో డ్రగ్స్ కలకలం.. సీవీ ఆనంద్ కీలక ప్రకటన

-

హైదరాబాద్ లో డ్రగ్స్ వ్యవహారం పై.. సీవీ ఆనంద్ కీలక ప్రకటన చేశారు. బహుదూర్ పుర లో డ్రగ్స్ ముఠా ను అరెస్ట్ చేశామని.. 225 గ్రామ్స్ బ్రౌన్ షుగర్, 28 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నామన్నారు సీవీ ఆనంద్. నలుగురుని అరెస్ట్ చేశాం.. ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు.. ప్రధాన నిందితుడు షాహ్జదా సయ్యద్ గతంలో ముంబై డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యాడని పేర్కొన్నారు. ఈ కేసులో వైజాగ్ నుంచి గంజాయి హైదరాబాద్ కి తరలిస్తున్న మరో ముగ్గురు మహిళలను అరెస్ట్ చేశాం.. ట్రిప్ కి 5 వేలు తీసుకొని వైజాగ్ నుంచి హైదరాబాద్ కి గంజాయి తీసుకొస్తున్నారని చెప్పారు సీవీ ఆనంద్.

ముంబై నుంచి బ్రౌన్ షుగర్ హైదరాబాద్ కి ఖాద్రి తీసుకొస్తున్నాడు.. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో వరుసగా డ్రగ్స్ పట్టుబడుతున్నాయి.. సౌత్ ఇండియన్ ఎయిర్ పోర్ట్స్ ని ఎంచుకుని ఆఫ్రికా దేశాల నుంచి డ్రగ్స్ తీసుకొస్తున్నారన్నారు సీవీ ఆనంద్. త్యాన్ జినియ, జమైకా, జాన్సన్ బర్గ్, సౌత్ ఆఫ్రికా దేశాల నుండి ఎక్కువగా డ్రగ్స్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ట్రాన్సిట్ పాయింట్ గా మారింది… 125 కోట్ల విలువైన డ్రగ్స్ ఇప్పటికే శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో పట్టుబడ్డాయని వెల్లడించారు.

డ్రగ్స్ తీసుకొచ్చేవారికి ఇక్కడ రిసీవర్స్ ఎవరో తెలియదు.. ఇక్కడికి వచ్చిన డ్రగ్స్ ముంబై, ఢిల్లీ కి తరలిస్తున్నారు.. సెంట్రల్ ఏజెన్సీస్, NCB, DRI, ED, Customs, CI cell, CISF అన్ని కలిసి పని చేస్తే ఈ ఇంటర్నేషనల్ డ్రగ్స్ రాకెట్ ని నిర్మూలించవచ్చన్నారు. దేశంలో 8 నుంచి 10 కోట్ల డ్రగ్ అనలిస్ట్ లు ఉన్నారని NCB అంచనా నివేదిక ఇచ్చింది.. గత పదేళ్ళలో దేశంలో 70 శాతం డ్రగ్స్ వాడకం పెరిగినట్లు NCB చెబుతుందని వెల్లడించారు. నేషనల్ ఎజేన్సీ ద్వారా డ్రగ్స్ కు చెక్ పడుతాం.. త్వరలోనే జాతీయ స్థాయిలో సమావేశం అవుతాం… అంతర్జాతీయ స్థాయిలో డ్రగ్స్ నిర్మూలనకు కృషి చేస్తామన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version