సైకిల్ స్పీడ్ కి , గ్లాసు జోరుకు …వైసీపీ కొట్టుకుపోవడం ఖాయం: చంద్రబాబు నాయుడు

-

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వైసీపీ పార్టీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.రానున్న ఎన్నికల్లో వైసీపీ కొట్టుకుపోవడం ఖాయమని టిడిపి చీఫ్ చంద్రబాబు అన్నారు.ఎన్డీయే కూటమి తరపున చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి ఈరోజు తణుకులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతూ…

 

‘రాష్ట్రంలో అగ్నికి వాయువు తోడైంది. ప్రజాగళానికి వారాహి తోడైంది. సైకిల్ స్పీడ్కి, గ్లాసు జోరుకు తిరుగులేదు. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి 3 పార్టీలు చేతులు కలిపాయి. జగన్ కబంద హస్తాల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి అని పిలుపునిచ్చారు.వైసీపీ అరాచక పాలనతో ప్రజలు విసుగు చెందారన్నారు. చీకటి పాలనను అంతం చేయడానికి ఓటు చీలకూడదు’ అని చంద్రబాబు ఆకాంక్షించారు.పవన్ కళ్యాణ్ కూటమి కోసం విశేష కృషి చేశారన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version