ఏపీలో ఘోరం.. పేలిన గ్యాస్‌ సిలిండర్‌.. నలుగురు మృతి

-

ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో విషాదం చోటుచేసుకున్నది. జిల్లాలోని శెట్టూరు మండలం ములకలేడులో ఓ ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ పేలిపోయింది. దీంతో నలుగురు అక్కడికక్కడే మరణించారు. అయితే.. మరో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. అయితే పేలుడు శబ్దం విన్న స్థానికులు పోలీసులకు, ఆగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.

అయితే.. పేలుడు ధాటికి ఇంటి పైకప్పు కూలిపోయింది. దీంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. పోలీసులు శిధిలాల నుంచి మృతదేహాలను వెలికితీశారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version