సీఎం కేజ్రీవాల్: ఢిల్లీ అభివృద్ధి వేగం పెరుగుతుంది !

-

ఈ రోజు సుప్రీం కోర్ట్ ఢిల్లీ పాలనా వ్యవహారాల మీద కీలక తీర్పును ఇచ్చింది. ఢిల్లీపై పూర్తి అధికారులు మరియు పాలనా వ్యవహారాలు అన్నీ రాజ్యాంగ బద్దంగా ఎన్నిక అయిన ప్రభుత్వానికే ఉంటాయని తేల్చి చెప్పింది. దీనితో ఎల్జీ సైలెంట్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా ప్రస్తుతం ఢిల్లీ లో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ తీర్పుపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈయన మాట్లాడుతూ ప్రజాస్వమ్యన్ని గెలిచి ఢిల్లీ ప్రజలకు న్యాయం చేసినందుకు సుప్రీం కోర్ట్ కు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.

ఇప్పటి వరకు ఢిల్లీ ఒక ఎత్తు అయితే.. ఇకపై ఢిల్లీ వేరే లెవెల్లో ఉండనుంది అని తెలిపారు. ఢిల్లీ అభివృద్ధిలో వేగం పుంజుకుంటుందని తెలిపారు. కాగా ప్రభుత్వం పరిధిలోనే అధికారులు బదిలీలు మరియు పోస్టింగ్ లు జరగనున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version