ఖరీదైన మద్యం తాగకండి.. మందు బాబులకు నారాయణ స్వామి సూచనలు !

-

డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖరీదైన మద్యాన్ని 10-15 ఏళ్లపాటు తాగితే.. శరీరంలో ఆల్కహాల్ ఉంటుందని…అందరూ ఖరీదైన మద్యాన్ని మానేయాలన్నారు. తాగుడుకు అలవాటు పడిన వాళ్ల ఆరోగ్యం సరిగా ఉండదని సూచించారు. నారా లోకేషును ఉద్దేశించి నేను ఎలాంటి అనుచిత కామెంట్లు చేయలేదని.. మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణతో జగన్ ప్రభుత్వానికి ఇబ్బందులు వస్తాయంటూ ఓ వ్యక్తి ఫోన్ చేసి నాతో మాట్లాడారని పేర్కొన్నారు.

ఆ వ్యక్తిని ఉద్దేశించి నేను చేసిన కామెంట్లని తనను ఉద్దేశించినట్టుగా లోకేష్ భావిస్తున్నారని.. సభలో అలాంటి కామెంట్లు చేయకూడదు.. నేను పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నానని వెల్లడించారు. నన్ను ఏ స్థాయిలో రెచ్చగొడితే నేను అలా మాట్లాడానో గమనించాలని.. బడుగులకు న్యాయం చేస్తోన్న ప్రభుత్వాన్ని కూలగొడతామంటే కోపం రాదా..? అని నిలదీశారు. సీఎం జగన్ను వాడూ వీడూ అని ఇష్టానుసారంగా లోకేష్ మాట్లాడుతున్నారని.. మద్యనిషేధం.. మద్య నియంత్రణ గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదని నిప్పులు చెరిగారు.

యనమల వియ్యంకుడుకు.. అయ్యన్నపాత్రుడు వంటి వారు మద్యం డిస్టలరీలు నడుపుతున్నారని.. ఇటీవలే అయ్యన్నపాత్రుడు తన డిస్టలరీలను అమ్ముకున్నారట అని ఫైర్‌ అయ్యారు. జగన్ ఎవ్వరికీ వ్యతిరేకం కాదని.. జగన్ పరిపాలన రామ రాజ్యాన్ని తలపిస్తోందని పేర్కొన్నారు. పదవుల కోసం టీడీపీ వాళ్లూ అర్రులు చాస్తారు.. వైసీపీ వాళ్లు పదవుల గురించి అర్రులు చాచరని.. ఎస్సీలను చులకనగా చూసేది చంద్రబాబే అని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version