తండ్రి మరణించాడు అని తెలిసినా, స్వాతంత్ర్య వేడుకల్లో నాయకత్వం వహించిన మహిళా పోలీస్…!

-

తన తండ్రి మరణించిన ఒక రోజు తర్వాత ఒక మహిళా పోలీసు అధికారి విధులకు హాజరు కావడం పోలీసు ఉన్నతాధికారులను కూడా విస్మయానికి గురి చేసింది. ఎన్ మహేశ్వరి అనే మహిళా ఇన్స్పెక్టర్ తిరునెల్వేలి జిల్లాలో సాయుధ రిజర్వ్ పోలీస్ ఇన్స్పెక్టర్ గా పని చేస్తున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పాలయంకోట్టై వీఓసీ మైదానంలో జిల్లా కలెక్టర్ శిల్పా ప్రభాకర్ సతీష్, పోలీస్ సూపరింటెండెంట్ ఎన్ మణివన్నన్ లకు ఏర్పాటు చేసిన గౌరవప్రదమైన పరేడ్‌కు నాయకత్వం వహించారు.

తన బాధను దిగమింగుతూ ఆమె నాయకత్వం వహించారు. లోపల బాధ ఉన్నా సరే ఎక్కడా కూడా ఆమె వెనక్కు తగ్గలేదు. ఎంఎస్ మహేశ్వరి తండ్రి నారాయణస్వామి (83) అనారోగ్యం కారణంగా ఆగస్టు 14 న మరణించారు. ఆగస్టు 14 న రాత్రి తన తండ్రి మరణం గురించి ఆమె తెలుసుకుంది. ఆమె తండ్రి అంత్యక్రియలు తిరునెల్వేలికి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న దిండిగల్ జిల్లాలో నిర్వహించారు. ఆమె మనోధైర్యాన్ని చూసి జిల్లా కలెక్టర్ కూడా ఆశ్చర్యపోయారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version