పార్టీ మార్పుపై స్పందించిన దేవినేని అవినాష్..

-

తెలుగు యువత అధ్యక్షుడు దేవినేని అవినాష్ త్వరలో టీడీపీని వీడతారని జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక‌ రేపు హైదరాబాద్ లో ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్, ఎం.పి విజయసాయిరెడ్డి తో దేవినేని అవినాష్ భేటి కానున్నారు. అయితే ఈనెల 23న జగన్ సమక్షంలో వైసీపీలో చేరతారని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారంపై దేవినేని అవినాష్ స్పందించారు. ప్రాణం ఉన్నంత వరకు టీడీపీలోనే కొనసాగుతానన్నారు దేవినేని అవినాష్‌.. టీడీపీలో తన ఎదుగుదల చూసి ఓర్వలేని కొందరు పనిగట్టుకుని తాను పార్టీ వీడుతున్నా నంటూ ప్రచారం చేస్తున్నానని.. తనకు పార్టీమారే ఆలోచనే లేనే లేదని స్పష్టం చేశారు.

తాను పార్టీ మారుతున్నానంటూ వస్తున్న వదంతులను ఎవరూ నమ్మవద్దు. పార్టీ అధినేత చంద్రబాబు, యవనేత లోకేష్‌ చూపిన మార్గంలో నడుస్తానని.. ప్రజాసమస్యలపై రాష్ట్రవ్యాప్తంగా తెలుగు యువత ఆధ్వర్యంలో పోరాడతామని వెల్లడించారు. ఇక దేవినేని అవినాష్ నుంచి ఈ రేంజిలో రిప్లై రావడంతో టీడీపీ నేతలు ఊపిరి పీల్చుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version