మొన్నే రిటైర్మెంట్.. అంతలోనే కొత్త ఇన్నింగ్స్ కి సిద్ధమైన ధోని.?

-

భారత క్రికెట్ చరిత్రలో దిగ్గజ ఆటగాడి గా తనకంటూ ఒక ప్రత్యేకమైన పేజీ లిఖించుకున్నాడు మహేంద్రసింగ్ ధోని. ఇప్పటివరకు ఏ సారథికి సాధ్యం కాని రికార్డును సృష్టించాడు. అయితే రాబోయే ప్రపంచకప్ లో ఆడుతాడు అని అభిమానులు అనుకుంటున్న తరుణంలో ఎవరూ ఊహించని విధంగా ఆగస్టు 15వ తేదీన తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్కు ధోని వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఐపీఎల్ లో ఆడుతున్నాడు మహేంద్రసింగ్ ధోని.

అయితే రిటైర్మెంట్ ప్రకటించి కొన్ని రోజులు కూడా కాలేదు అప్పుడే తన కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు సిద్ధమయ్యాడు. ఇప్పటికే తన సొంత బ్యానర్ ధోనీ ఎంటర్టైన్మెంట్స్ నుంచి.. రోర్ ఆఫ్ ది లయన్ నిర్మించిన ధోని ఎంటర్టెన్మెంట్ రంగంలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. ఇక వచ్చే ఏడాది నుంచి వరుసగా మరిన్ని వెబ్ సిరీస్ లు నిర్మించేందుకు సిద్ధమవుతున్నాడట. మొదట రోర్ ఆఫ్ లయన్ వెబ్ సిరీస్ నిర్మిస్తున్న సమయంలో ఎంటర్టైన్మెంట్ రంగంలోకి ప్రవేశించటానికి సరైన సమయంగా భావించామని కొత్త ప్రతిభను ఎప్పుడు ప్రోత్సహిస్తూనే ఉంటాము అంటూ ధోనీ భార్య సాక్షి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version