ఎంపీ బాలశౌరి – ఎమ్మెల్యే పేర్ని నాని మధ్య మరోసారి బయటపడిన విభేదాలు

-

మచిలీపట్నంలో ఎంపీ బాలశౌరి – ఎమ్మెల్యే పేర్ని నాని మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. మచిలీపట్నంలో జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో కొత్తగా స్పందన సమావేశం మందిరం ఏర్పాటు చేశారు. ఈ అధికారిక కార్యక్రమానికి ఎమ్మెల్యే పేర్ని నాని డుమ్మా కొట్టారు. అయితే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఎంపీ బాలశౌరి. ఎంపీ లాడ్స్ నుంచి సమావేశం మందిర నిర్మాణానికి 15 లక్షలు ఇచ్చారు ఎంపీ బాలశౌరి.

ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు ఎమ్మెల్యే నాని. అయితే పోలీసుల నుంచి వచ్చిన ఆహ్వాన పత్రికలో సైతం పేర్ని నానికి ప్రాధాన్యత దక్కలేదు. ప్రత్యేక అతిధుల జాబితాలో నగర మేయర్, ఏడుగురు జిల్లా శాసనమండలి సభ్యుల తర్వాత పేర్ని నాని పేరు ఉంది. దీంతో కలెక్టరేట్ లో ధాన్యం కొనుగోలు ఇబ్బందులపై జేసీ, పౌరసరఫరాల శాఖ అధికారితో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు పేర్ని నాని. మరోవైపు ఎంపీ తీరుపై పేర్ని నాని వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ప్రోటోకాల్ ప్రకారమే ఆహ్వాన పత్రికలో పేర్లు వేశామంటున్నాయి పోలీసు వర్గాలు.

Read more RELATED
Recommended to you

Exit mobile version