రాజకీయాలలోకి ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు

-

దిల్ రాజు.. సినీ ఇండస్ట్రీలో పరిచయం అక్కర్లేని పేరు. ఇండస్ట్రీలో ప్రస్తుతం అగ్ర నిర్మాతల్లో ప్రముఖ వ్యక్తి. ఈ స్టార్ ప్రొడ్యూసర్ త్వరలో రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నారని గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. నిజామాబాద్ లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, తన సొంతూరు నర్సింగ్ పల్లి లో ఇందూరు – తిరుమల తిరుపతి దేవస్థానాన్ని నిర్మించారు.

అంతేకాకుండా ఆలయంలో చిన్న పిల్లలకు, గర్భిణీలకు ఆయుర్వేద మందులను కూడా అందిస్తున్నారు. ఇటీవల దిల్ రాజు కుమార్తె హన్సిత, అన్న కుమారుడు హర్షిత్ నిర్మించిన బలగం సినిమా ప్రీ రిలీజ్ వేడుకలకు తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ముఖ్యఅతిథిగా హాజరైన విషయం తెలిసిందే. అయితే ఈ వేడుకలలో మంత్రి కేటీఆర్ ని దిల్ రాజు పొగడడంతో రాజకీయాలలోకి రావాలని సన్నాహాలు చేస్తున్నారని ప్రచారం మొదలైంది.

దీంతో ఈ వార్తలపై తాజాగా క్లారిటీ ఇచ్చారు దిల్ రాజు. ” రాజకీయాలలోకి రావాలని నాకు చాలా ఆఫర్లు ఉన్నాయి. కానీ నేను రాను. సినిమా జీవితంలోనే నన్ను విమర్శిస్తుంటే తట్టుకోలేకపోతున్నాను. ఇక రాజకీయాలలోకి వచ్చాక తట్టుకోగలనా. ఎట్టి పరిస్థితుల్లోనూ రాజకీయాలలోకి వచ్చేది లేదు” అని క్లారిటీ ఇచ్చారు దిల్ రాజు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version