Breaking : గడ్డి పాటి అంటూ మరోసారి గరికపాటిపై ఆర్జీవీ ఫైర్‌

-

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. అయితే.. ఆయన ఏదో ఒక విషయాన్ని ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేస్తూ వివాదాలను సృష్టిస్తుంటారు. అయితే.. ఇక అందులో భాగంగానే తాజాగా మరోసారి సంచలన ట్వీట్స్ తో ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచారు ఆర్జీవీ. ఈసారి ఆయన గరికపాటి నరసింహారావుపై ట్విట్టర్ వేదికగా కొన్నికామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. ఇక అసలు వివరాల్లోకి వెళితే.. ఇటీవల అలయ్ బలయ్ కార్యక్రమంలో గరికపాటి, చిరంజీవిని మధ్య ఓ ఘటన జరిగిన సంగతి తెలిసిందే.

అభిమానులతో చిరంజీవి ఫోటోలు దిగుతున్న సమయంలో గరికపాటి ఫోటో సెషన్ ఆపేస్తే తాను మాట్లాడుతానని, లేదంటే వెళ్లిపోతానని ఆ కార్యక్రమంలో వెల్లడించారు. ఈ నేపథ్యంలో చిరంజీవి తమ్ముడు నాగబాబుతో సహా మెగా అభిమానులు సైతం గరికపాటిపై సోషల్ మీడియాలో విమర్శలు చేశారు. అయితే.. దీంతో ఆర్జీవీ సైతం గరికపాటిని టార్గెట్‌ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే.. తాజాగా ఓ వీడియోను జత చేస్తూ.. ట్వి్ట్టర్‌ వేదికగా ‘అత్యాచారాలకు మహిళలే బాధ్యులని గడ్డి పాటి అన్నారు..ఈ వ్యక్తిని ఆత్మగౌరవం ఉన్న మహిళలందరూ కొట్టి చంపాలి’ అంటూ పోస్ట్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version