అయోధ్య తొలి ఆహ్వానపత్రిక ఆయనకే.. !?

-

ఆగస్టు 5వ తేదీన భారత దేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ ఎన్నో దశాబ్దాల నుంచి ఎదురు చూస్తున్న కల నెరవేరబోతోందన్న విషయం తెలిసిందే. దశాబ్దాల పాటు పోరాడి సాధించుకున్న రామ జన్మభూమి అయోధ్య స్థలంలో రామాలయానికి ఆగస్టు 5వ తేదీన భూమి పూజ చేయనున్నారు. అయితే ఈ భూమిపూజ కార్యక్రమానికి ఆలయ ట్రస్టు కేవలం పరిమిత సంఖ్యలో అతిథులను ఆహ్వానించిన విషయం తెలిసిందే.

అయితే అయోధ్య రామమందిర నిర్మాణ భూమి పూజ తొలి ఆహ్వాన పత్రిక ఇక్బల్ అన్సారీ కి అందిందట . అయోధ్య భూవివాదం కక్షిదారుల్లో ఒక్కరైనా ఇక్బాల్ అన్సారీ … ఆహ్వాన పత్రిక తనకు అందడంపై ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. రాముడి అభీష్టం మేరకే ఈ ఆహ్వాన పత్రిక తనకు అందిందని అంటూ చెప్పుకొచ్చారు ఇక్బాల్ అన్సారీ .రామ మందిర నిర్మాణం తో అయోధ్య మరింత కోలాహలంగా మారుతుంది అంటూ ఆయన వ్యాఖ్యానించారు. స్థానికులు అందరికీ ఉపాధి కూడా లభిస్తుంది అంటూ చెప్పుకొచ్చారు. ఈరోజు ఉదయం గౌరీ గణపతి పూజ భూమి పూజ కు శ్రీకారం జరిగింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version