BREAKING : ఇవాళ ఏపీకి ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము

-

ఇవాళ ఏపీకి ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము రానున్నారు. ఇందులో భాగంగానే మధ్యాహ్నం 1.30 కి గన్నవరం ఎయిర్ పోర్ట్ కు చేరుకోనున్నారు ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము. ఈ సంద‌ర్భంగా ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు స్వాగతం పలకనున్నారు బీజేపీ నేతలు. ఇక మధ్యాహ్నం మూడు గంటలకు తాడేపల్లి లోని సీఎం క్యాంప్ ఆఫీస్ కి ద్రౌపది ముర్ము వెళ్ల‌నున్నారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్రపతి అభ్యర్థికి తేనీటి విందు ఇవ్వనున్నారు సీఎం జగన్.

అనంతరం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో భేటీ కానున్నారు ముర్ము. తన ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రానికి ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము వ‌స్తున్నారు. కాగా.. బిజెపి రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది తెలంగాణ రాష్ట్ర పర్యటన వాయిదా పడింది. రాష్ట్రపతి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇక్కడి ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇద్దరు మేధావులతో ఇవాళ ఆమె సమావేశం కావాల్సి ఉంది. అయితే తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది తెలంగాణ పర్యటన వాయిదా పడింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version