నువ్వా – నేనా : గజ్వేల్ బరిలో ఈటెల రాజేందర్ … కేసీఆర్ కు పోటీగా ?

-

తెలంగాణాలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండడంతో అన్ని రాజకీయ పార్టీలు అబ్యర్థుల ఎంపికపై తమ దృష్టిని కేంద్రీకరించాయి. ఇక ఇటీవల వచ్చిన ఒక పద్ధతి ఏమిటంటే సర్వే ల ద్వారా ఈ అభ్యర్థి గెలుస్తాడు అని తెలుసుకుని వారిని మాత్రమే పార్టీ అభ్యర్థిగా బరిలోకి దించనున్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా తెలంగాణ పొలిటికల్ వర్గాల్లో ఒక విషయం చక్కర్లు కొడుతోంది. గత ఎన్నికల సమయంలో TRS నుండి పోటీ చేసి హుజురాబాద్ నుండి గెలిచిన ఎమ్మెల్యేగా ఈటల రాజేందర్ కు పేరుంది, ఆ తర్వాత పార్టీ నుండి బయటకు వచ్చి ఎమ్మెల్యే గా రాజీనామా చేసి బీజేపీలో చేరారు. కాగా వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే గా పోటీ చేయనున్న గజ్వేల్ నియోజకవర్గం నుండి ఈటల పోటీ చేస్తారని వార్త వినబడుతోంది. ఈ రాష్ట్రంలో ఎవరి వల్ల అయితే ఇబ్బందులు ఎదుర్కొన్నాడో ? వారిపైనే గెలవాల్సని పట్టుదలగా ఈటల ఉన్నట్లు తెలుస్తోంది.

అందుకే గజ్వెల్ లో కేసీఆర్ ను ఓడించడమే ప్రధాన లక్ష్యంగా బీజేపీ ఈటల రాజేందర్ అన్ని వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాడు. ఇక్కడ పోటీ నువ్వా నేనా అన్నట్లు సాగె అవకాశం ఎక్కువగా ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version