మోదీని ఫాలో అవడం ప్రారంభించిన ఎలాన్ మస్క్

-

ఎలాన్ మస్క్ ఎంత ధనవంతుడో ప్రత్యేకంగ చెప్పనవసరం లేదు. అతను ఏమి చేసినా అది వైరల్ అవుతుంది. స్టాక్ మార్కెట్ ని, క్రిప్టో మార్కెట్ ని సైతం కేవలం ఒక్క ట్వీట్ తో తలకిందులు చేసే సత్త ఉన్న మనిషి. ట్విట్టర్ ను కొనుగోలు చేశాక దాదాపు ప్రతిరోజు మీడియా ఐటమ్ గా కనబడుతాడు ఈ ఎలాన్ మస్క్. తన ట్రేడ్ మార్కు నిర్ణయాలను ట్విట్టర్ ను కుదుపులకు గురిచేస్తున్న ఎలాన్ మస్క్… ఇప్పుడు కొత్తగా భారత ప్రధాని అయిన నరేంద్ర మోదీని ట్విట్టర్ లో ఫాలో అవడం ద్వారా మరోసారి అందరి దృష్టిని ఆకర్షించాడు.

ఎలాన్ మస్క్ ట్విట్టర్ లో 195 మందిని ఫాలో అవుతున్నారు. మస్క్ ఫాలో అయ్యే వారి జాబితా స్క్రీన్ షాట్ ట్విట్టర్ లో బాగా వైరల్ అయ్యింది. ఆ జాబితాలో నరేంద్ర మోదీ పేరు కూడా ఉండడం విశేషం. కాగా, ట్విట్టర్ లో అత్యధిక ఫాలోవర్లు ఉన్న వ్యక్తి ఎలాన్ మస్కే. ఆయనను ట్విట్టర్ లో 134.3 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు .

కాగా, మస్క్ ఇప్పుడు భారత ప్రధానిని ఫాలో అవుతుండడం పట్ల నెటిజన్లు తలోరకంగా స్పందిస్తున్నారు. కొందరేమో… త్వరలో మస్క్ తన టెస్లా ఫ్యాక్టరీని భారత్ లో స్థాపిస్తాడనుకుంటా అని వ్యాఖ్యానించగా, మరికొందరు ఇది ఆశ్చర్యకరమైన పరిణామం అని పేర్కొన్నారు.
ఇంకొందరు… మోదీ భారత్ ను మెరుగైన దేశంగా తీర్చిదిద్దుతుండడమే అందుకు కారణమని చెబుతున్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version