దళిత జాతిని సీఎం చేస్తా అని కేసీఆర్‌ మోసం చేశారు : ఈటల రాజేందర్‌

-

హైదరాబాద్‌ వేదికగా నిర్వహిస్తున్న బీజేపీ విజయ సంకల్ప సభకు రాష్ట్రంలోని నలుమూలల నుంచి భారీ బీజేపీ శ్రేణులు తరలివచ్చారు. అయితే సభలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ.. రూ. 33 కోట్ల ప్రజాధనంతో టీఆర్ఎస్ ఫ్లెక్సీలు, హోర్డింగ్ పెట్టారని ఆరోపించారు. సీఎం కేసీఆర్ ముఖం చూసేందుకు ప్రజలు ఇష్టపడకపోయినా బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తున్నారని, ప్రధాని మోదీ ఫ్లెక్సీలు లేకుండా చేసేందుకు చాలా ప్రయత్నాలు చేశారని ఆరోపించారు ఈటల రాజేందర్‌ . ఫ్లెక్సీలు చింపేసినంత మాత్రాన 130 కోట్ల మంది హృదయాల్లో ప్రధాని మోదీ ఉన్నారన్న ఈటల రాజేందర్‌ .. ప్రధాని మోదీ దళితులకు అగ్రపీఠం ఇచ్చారని, కానీ సీఎం కేసీఆర్ దళిత ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి మాటతప్పారని విమర్శించారు.

దళితులు, గిరుజనులపై సీఎం కేసీఆర్ కు గౌరవం ఉంటే ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు తెలిపాలన్నారు ఈటల రాజేందర్‌ . ప్రధాని మోదీ అండతో బంగారు తెలంగాణ తెస్తామన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. కేసీఆర్‌ని ఖచ్చితంగా ఓడగొట్టాలని ఈటల రాజేందర్‌ పిలుపునిచ్చారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version