కదిరి కొండపై వెలిగే అఖండ జ్యోతి.. పున్నమి ఉత్సవాల విశేషాలు

-

శ్రీ సత్యసాయి జిల్లాలోని కొమ్మరవాండ్లపల్లిలో వెలసిన కదిరి కొండపై ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. శ్రీ ఖాద్రీ లక్ష్మీ నృసింహ సేవా సమితి ఆధ్వర్యంలో స్వాతి నక్షత్రం, పున్నమి వేళ నిర్వహించిన అఖండ జ్యోతి ప్రజ్వలన భక్తులను పరవశింపజేసింది. సాక్షాత్తు నరసింహ స్వామి పాదం మోపిన ఈ పవిత్ర స్తోత్రాద్రిపై వెలిగిన జ్యోతి వెనుక ఉన్న ఆధ్యాత్మిక మర్మం, శాస్త్రీయ కోణాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

ఖాద్రీ పురం అంటే ఏమిటి?: పురాణాల ప్రకారం ‘ఖ’ అంటే శ్రీవారి పాదం అని, ‘అద్రి’ అంటే పర్వతం అని అర్థం. నరసింహ స్వామి వారు మొదటగా ఈ పర్వతంపై పాదం మోపడం వల్లే దీనికి ఖాద్రీ పురం అనే పేరు వచ్చింది. భక్త ప్రహ్లాదుడి ప్రార్థనతో ఉగ్రరూపాన్ని వీడి, స్వామివారు ఇక్కడ ప్రశాంత మూర్తిగా కొలువయ్యారని భక్తుల నమ్మకం.

జయ జయ నరసింహ నామస్మరణ: మార్చి 9వ తేదీన జరిగిన కార్యక్రమంలో సేవా సమితి సభ్యులు కొండపై గోవింద నామస్మరణతో అఖండ జ్యోతిని వెలిగించారు. “జయ జయ సింహ జయ నరసింహ” అంటూ భక్తులు చేసిన నినాదాలతో స్తోత్రాద్రి కొండ ప్రతిధ్వనించింది. ఈ వెలుగులు చుట్టుపక్కల గ్రామాలకు ఒక ప్రత్యేక ఆధ్యాత్మిక కళను పంచాయి.

Eternal Flame on Kadiri Hill: Highlights of the Grand Pournami Festival
Eternal Flame on Kadiri Hill: Highlights of the Grand Pournami Festival

బ్రహ్మ గరుడ సేవ – కదిరి పున్నమి: ప్రతి ఏటా ఫాల్గుణ మాసంలో 15 రోజుల పాటు ఇక్కడ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఇందులో “బ్రహ్మ గరుడ సేవ” అత్యంత ప్రధానమైనది. ఆ రోజునే భక్తులందరూ ఎంతో భక్తితో ‘కదిరి పున్నమి’గా జరుపుకుంటారు.ఇక  ఈ పవిత్ర సమయంలో కొండపై జ్యోతిని దర్శించుకోవడం సర్వపాప హరణమని భక్తులు భావిస్తారు.

జ్యోతి వెలిగించడం వెనుక ఉన్న మర్మం: ఈ అఖండ జ్యోతి ప్రజ్వలన వెనుక కేవలం ఆధ్యాత్మికతే కాదు, శాస్త్రీయ, సామాజిక కారణాలు కూడా ఉన్నాయని సేవా సమితి సభ్యులు తెలిపారు. రాయలసీమ పుణ్యక్షేత్రాలలో కదిరి కొండకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. అఖండ జ్యోతి వెలుగుల్లో మెరిసిపోతున్న ఈ క్షేత్రం, భక్తులకు మానసిక ప్రశాంతతను, ఆత్మవిశ్వాసాన్ని ప్రసాదిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news