నేను ఒక స్టార్ హీరోగా ఉండి కూడా…మీకోసం వచ్చి మాట్లాడుతున్నాను : పవన్ కళ్యాణ్

-

తూ.గో జిల్లా లో వారాహి విజయ యాత్రలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…జక్కంపూడి రామ్మోహనరావు గారు అంటే నాకు గౌరవం ఐనా సరే జక్కంపూడి రాజా గారు ఓడిపోతున్నారు అని అన్నారు .ఆయనకు అనుకూలంగా ఉండి మా నాయకులు, జనసైనికుల మీద అక్రమ కేసులు పెడుతూ, బెదిరిస్తున్న వారు ప్రవర్తన మార్చుకోవాలి, ప్రభుత్వం మారిపోతుంది, మీరు పారదర్శకంగా లేకపోతే మేము అధికారంలోకి వచ్చాక చర్యలు తీసుకుంటాం జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చారు.

అధికారంలోకి వచ్చాక కుల గణాంకాల తో పాటు ప్రతిభా గణాంకాలు తీసుకోవాలి అని చంద్రబాబు నాయుడు గారికి చెప్పాను, దాని ప్రకారం మీకు స్కిల్ డెవలప్మెంట్ చేసి 2047 నాటికి భారత్ సూపర్ పవర్ గా ఎదగటానికి భాగస్వాములు గా చేస్తాం అని హామీ ఇచ్చారు.నేను ఒక స్టార్ హీరోగా ఉండి కూడా నేను మీకోసం వచ్చి మాట్లాడుతున్నాను, నాకోసం కాదు, మీ భవిషత్తు కోసం ఆలోచించేవాడు ఉండాలి అని వచ్చాను అని అన్నారు.మేము నాయకులం కాదు, మీ సేవకులం, మీకు సేవ చేయడం కోసం కూటమిగా ముందుకు వచ్చాం అని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version