BREAKING : మాజీ మంత్రి, వైసీపీ నేత కన్నుమూత..!

-

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, కడప జిల్లాకు చెందిన వైసీపీ నేత ఖలీల్ బాషా కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన తీవ్ర అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం విషమించడంతో మంగళవారం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.

ఖలీల్ మరణంతో కుటుంబ సభ్యులు, అభిమానులు, కార్యకర్తలు కన్నీరుమున్నీరవుతున్నారు. గతంలో టీడీపీ హాయాంలో 2 సార్లు ఎమ్మెల్యేగా, మైనార్టీ శాఖ మంత్రిగా ఆయన 2019 ఫిబ్రవరిలో సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. బాషా అంత్యక్రియలు బుధవారం నాడు కడప జిల్లాలో జరగనున్నాయని కుటుంబీకులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version