రోడ్లపై లాటరీ టికెట్లు అమ్ముతూ.. దీనమైన జీవితాన్ని గడుపుతున్న ప్రముఖ నటి..!

-

సాధారణంగా దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలని అంటూ ఉంటారు . కానీ నటీనటులు అవకాశాలు ఉన్నప్పుడే డబ్బు వెనకేసుకోవాలి లేదంటే మరెన్నో కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. సరిగా ఇక్కడ ఒక నటి కూడా.. 35 కి పైగా సినిమాలలో నటించి ఆ డబ్బుతోనే కూతుర్ల పెళ్లి కూడా చేసింది. పనిలో పనిగా బ్యాంకు లోన్ తీసుకొని ఇల్లు కట్టుకోవాలని అనుకుంది. కానీ చాలామంది జీవితాల్లోకి పిడుగు లాగా వచ్చిపడిన కరోనా చాలామంది జీవితాలను అతలాకుతులం చేసింది. ఈ క్రమంలోనే దెబ్బకు ఈమె జీవితం కూడా తలకిందులైంది. లగ్జరీ జీవితం కాస్త రోడ్డున పడిపోయింది . దీంతో రోజుల వ్యవధిలోనే పరిస్థితి మొత్తం మారిపోయిందని చెప్పాలి.

ఇక ఆమె ఎవరు అనే విషయానికి వస్తే.. ప్రేమమ్ హీరో నివిన్ పౌలీ హీరోగా 2016 లో వచ్చిన సినిమా యాక్షన్ హీరో బిజు చిత్రంలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న మేరీ. ఈ సినిమా తర్వాత పైపిన్ చువత్తిలే ప్రణయం తో మరొక హిట్టు కొట్టి పలు యాడ్స్ లో కూడా నటించింది. అంతేకాదు అలా వచ్చిన డబ్బులతో ఇద్దరు కూతుర్లకు గ్రాండ్గా పెళ్లి చేసిన ఈమె సినిమా ఆఫర్లు వస్తుండడంతో అప్పు తీర్చగలనని ఉద్దేశంతో ఇల్లు కట్టుకుంది. కానీ కరోనా మహమ్మారి వల్ల ఈమె జీవితం అతలాకుతలమైంది. దీంతో కుటుంబాన్ని చూసుకోవడానికి చిన్నచితకా ఉద్యోగాలు చేయాల్సి వచ్చింది.

మరొకవైపు ఈమె చిన్న కుమారుడు అనారోగ్యంతో ఉన్నాడు . అతడి వైద్య ఖర్చులు, బ్యాంకు లోన్ తీర్చాలంటే కచ్చితంగా మేరీ ఏదో ఒక పని చేయక తప్పదు. ఈ క్రమంలోనే రోడ్లపై లాటరీ టికెట్ అమ్ముతూ ఆ వచ్చిన కొద్దిపాటి డబ్బుతో కుటుంబాన్ని పోషిస్తుంది. ఇన్ని కష్టాలు ఉన్నప్పటికీ తన నమ్మకాన్ని కోల్పోకుండా ఎప్పటికైనా సరే నిర్మాతలు పిలిచి తనకు అవకాశాలు ఇస్తారనే నమ్మకంతో జీవిస్తోంది మేరీ. మరి ఈమె దీనావస్థ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version