చిత్ర పరిశ్రమలో మరో విషాదం..ప్రముఖ రచయిత్రి రామలక్ష్మీ ఆరుద్ర మృతి

-

ఇండస్ట్రీలో విషాదాలు విరామం లేకుండా జరుగుతూనే వస్తున్నాయి. ఇప్పటికే ఎందరో నటీనటులను పోగొట్టుకున్న ఇండస్ట్రీ తాజాగా మరొక షాకింగ్ సంఘటన ఎదుర్కొంది. దివంగత కవి ఆరుద్ర సతీమణి, రచయిత్రి రామలక్ష్మి (93) కన్నుమూశారు.

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాదులోని పెద్ద కుమార్తె నివాసంలో తుది శ్వాస విడిచారు. 1930 డిసెంబర్ 31 న జన్మించిన రామలక్ష్మి 1954లో ఆరుద్రను వివాహమాడారు. రచయితగా తొణికిన స్వర్గం, ఆంధ్ర నాయకుడు వంటి 12 కు పైగా నవలలు రాశారు. జీవనజ్యోతి, చిన్నారి పాపలు చిత్రాలకు కథ అందించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version