పాకిస్తాన్‌లో భయం, భయం.. లాహోర్, కరాచీలో అటాక్

-

దాయాది పాకిస్తాన్‌లో మరోమారు అటాక్ జరిగినట్లు తెలుస్తోంది. గురువారం ఉదయం లాహోర్ లోని ఓ ఎయిర్ పోర్టులో పేలుళ్లు సంభవించిన విషయం తెలిసిందే. తాజాగా కరాచీలోనూ దాడి జరిగినట్లు పాక్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.అయితే, దాడుల నేపథ్యంలో భయంతో పాక్ ప్రజలు పరుగులు తీస్తున్నట్లు సమాచారం.


నేడు మొత్తం ఐదు చోట్ల దాడులు జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. డ్రోన్స్ ద్వారా అటాక్ జరిగినట్లు పాక్ మీడియా కథనాలు వస్తుండగా.. ఎప్పుడు ఏ వైపు నుంచి అటాక్ జరుగుతుందోనని భయాందోళనలో పాక్ ప్రజలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, భారత్ మరోసారి తమ మీద దాడికి యత్నించిందని.. మొత్తం 9 డ్రోన్లను గుర్తించామని.. వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టామని పాక్ ఆర్మీ అధికారి ఒకరు మీడియాకు వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news