చంద్రబాబు బెయిల్ పై మధ్యాహ్నం తీర్పు !

-

స్కిల్ స్కాం కేసులో తప్పు చేశారన్న అంశం మీద చంద్రబాబును అరెస్ట్ చేసి మళ్ళీ మధ్యంతర బెయిల్ మీద విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ బెయిల్ కు కేవలం నాలుగు వారాల సమయం మాత్రమే ఉండడంతో, రెగ్యులర్ బెయిల్ కోసం చంద్రబాబు లాయర్లు ఆయన ఆరోగ్య సమస్యలను కారణాలుగా చూపిస్తూ హై కోర్ట్ లో పిటీషన్ వేయడం తెలిసిందే. ఈ బెయిల్ పిటీషన్ పై ఇరు వర్గాల వాదనలు విన్న హై కోర్ట్ తీర్పును రిజర్వు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక ఫైనల్ గా ఈ రోజు మధ్యాహ్నం 2 .15 గంటలకు తీర్పును ఇవ్వనుంది హై కోర్ట్. దీనితో ఆంధ్రప్రదేశ్ లో చాలా ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా చంద్రబాబు అభిమానులు, కార్యకర్తలు, టీడీపీ క్యాడర్ ఈ తీర్పు కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.

మరి హై కోర్ట్ ఈ కేసు విషయంలో చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ ను మంజూరు చేస్తుందా అన్నది తెలియాలంటే మరో రెండు గంటల పాటు వేచి ఉండాల్సిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version