SHOCKING: తెలంగాణలో 20 లక్షల మందికి కరోనా లక్షణాలు

-

కరోనా తీవ్రతపై షాకింగ్ నిజాలు వెలువడుతున్నాయి. తాజాగా తెలంగాణలో 20 లక్షల మందికి కరోనా లక్షణాలు ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ సర్వేలో తేలింది. వచ్చే రోజుల్లో కేసుల సంఖ్య మరింతగా పెరుగవచ్చని అంచనా వేసింది. గతేడాది డిసెంబర్ రెండో వారం నుంచి ఏఎన్ఎంలు, అంగన్వాడీలు, ఆశవర్కర్లు చేసిన ఫీవర్ సర్వేలో ఈ విషయం తేలింది. ఒక్క హైదరాబాద్ లోనే 15 లక్షల మందికి పైగా కరోనా లక్షణాలు ఉన్నట్లు తేలింది. త్వరలోనే ఈ సర్వే వివరాలను వైద్యారోగ్య శాఖ ప్రభుత్వానికి అందచేయనుంది.

ఇదిలా ఉంటే ప్రస్తుతం తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. రోజుకు 2500 పైగా కేసులు నమోదువుతున్నాయి. మరోవైపు ఓమిక్రాన్ కేసులు కూడా పెరుగుతున్నాయి. వచ్చే రెండు మూడు వారాలు కీలకం కాబోతున్నాయి. దీంతో ప్రజలంతా అప్రమత్తంగా వ్యవహరించాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version