ఫ్లిప్‌కార్ట్‌లో మొబైల్స్ బొనాంజా సేల్

-

ఈ-కామ‌ర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ మ‌రో సేల్‌ను నిర్వ‌హిస్తోంది. మొబైల్స్ బొనాంజా సేల్ ను ప్రారంభించింది. ఈ సేల్ ఇప్ప‌టికే ప్రారంభం కాగా ఈ నెల 10వ తేదీ వ‌ర‌కు కొన‌సాగ‌నుంది. ఇందులో ప‌లు కంపెనీల‌కు చెందిన ఫోన్ల‌పై భారీ త‌గ్గింపు ధ‌ర‌లు, ఆక‌ట్టుకునే ఆఫ‌ర్ల‌ను అందిస్తున్నారు.

ఫ్లిప్‌కార్ట్ మొబైల్స్ బొనాంజా సేల్‌లో ఇన్పినిక్స్ నోట్ 7 ను రూ.11,499కి బ‌దులుగా రూ.9,999 ధ‌ర‌కు కొనుగోలు చేయ‌వ‌చ్చు. ఇందులో 6.95 ఇంచుల హెచ్‌డీ ప్ల‌స్ ఐపీఎస్ డిస్‌ప్లే, ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జి70 ప్రాసెస‌ర్‌, 4జీబీ ర్యామ్‌, 64జీబీ స్టోరేజ్ ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. సేల్‌లో భాగంగా ఐఫోన్ ఎక్స్ఆర్ ను రూ.10వేల డిస్కౌంట్‌తో కేవ‌లం రూ.40వేల‌కే కొనుగోలు చేయ‌వ‌చ్చు.

సేల్‌లో ఐఫోన్ 11 ప్రొ రూ.99,999కు బ‌దులుగా రూ.79,999 ధ‌ర‌కే ల‌భిస్తోంది. రూ.20వేల డిస్కౌంట్ పొంద‌వ‌చ్చు. అలాగే పాత స్మార్ట్ ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేస్తే మ‌రో రూ.26,601 అద‌న‌పు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ పొంద‌వ‌చ్చు. ఇక ఐఫోన్ ఎక్స్ఆర్‌కు అయితే రూ.15,150 వ‌ర‌కు ఎక్స్‌చేంజ్ డిస్కౌంట్‌ను పొంద‌వ‌చ్చు. ఇక సేల్‌లో ఐఫోన్ ఎస్ఈ 2020ని రూ.32,999 ధ‌ర‌కు కొన‌వ‌చ్చు. అలాగే మోటో జీ9 రూ.11,499కు బ‌దులుగా రూ.9,999 ధ‌ర‌కు ల‌భిస్తోంది. ‌

Read more RELATED
Recommended to you

Exit mobile version