బాహుబలి డైలాగ్ లతో రెచ్చిపోయిన మాజీ మంత్రి బాలినేని

-

మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి బాహుబలి రేంజ్ లో రెచ్చిపోయారు.హోం మంత్రి కారు పై చేయి పడితే తన కారు పై పడ్డట్టే అంటూ..ప్రభాస్ చెప్పిన డైలాగులు చెప్పారు.గర్భంతో ఉన్న మహిళ పై అత్యాచారం జరగడం దురదృష్టకరమని బాలినేని అన్నారు.బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం రూ. 10 లక్షల ఆర్థిక సాయం చేసిందని, వ్యక్తిగతంగా తాను కూడా రూ.2 లక్షల సాయం అందించానని బాలినేని తెలిపారు.గతంలో టీడీపీ హయాంలో కమ్మ పాలెం కు వెళుతున్న తనను కూడా ఇలాగే అడ్డుకున్నారని గుర్తు చేశారు.

టిడిపి నేతల చర్యలకు కచ్చితంగా ప్రతిచర్య ఉంటుందనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని బాలినేని హెచ్చరించారు.రేపల్లె ఘటనపై ప్రతిపక్షాలు రాజకీయాలు చేయడం హేమని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు.ఒంగోలు రిమ్స్ లో చికిత్స పొందుతున్న రేపల్లె అత్యాచార ఘటన బాధితురాలిని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి తో కలిసి ఆయన పరామర్శించారు.ఈ ఘటనలో నిందితులను పోలీసులు పట్టుకున్నారని, వారికి కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version