నేటి నుంచి హైదరాబాద్‌లో ఉచిత కరోనా పరీక్షలు..!

-

తెలంగాణ వ్యాప్తంగా కరోనా మృత్యుఘంటికలు మోగిస్తుంది. రోజురోజుకి దీని తీవ్రత పెరిగిపోతుంది. కేసులతో పాటు మృతుల సంఖ్య కూడా పెరుగుతుంది. అలాగే ఒక పక్క డాక్టర్ల నిరసనలు, మరోపక్క టెస్టులు ఎక్కువగా చేయడంలేదంటూ కోర్టు మెట్టికాయలు. ఇవన్నీ తెలంగాణ సర్కార్ కి తలనొప్పిగా మారాయి.. దీంతో ఎలా అయినాసరే కరోనాని కట్టడి చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. దీనికి అనుగుణంగానే పరీక్షల్లో వేగం పెంచారు.

అయితే తాజాగా హైదరాబాద్‌లో ఇవాల్టి నుంచి ఉచిత కరోనా పరీక్షలు చేయాలని నిర్ణయించుకున్నారు. అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్న ప్రాంతాల్లో ఈ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌ పరిసరాల్లో 50 వేల మందికి కరోనా పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. గతంలో పాజిటివ్‌ వచ్చిన వారి కుటుంబ సభ్యులు, కాంటాక్ట్‌ అయిన వారికి మొదట ఈ కరోనా పరీక్షలు చేయనున్నారు. ఒక్కో కేంద్రంలో రోజుకు 150 మందికి మాత్రమే పరీక్షలు నిర్వహించనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version