మళ్ళీ పెరిగిన గ్యాస్ ధర.. ఈసారి ఎంత అంటే..?

-

 ఈ మధ్య కాలంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలను ప్రతి రోజూ పెంచుతూ వచ్చిన కంపెనీలు ఈ మధ్య గ్యాప్ ఇచ్చాయి. అయితే ఈరోజు మాత్రం వంట గ్యాస్‌ ధరలను పెంచాయి. ఏకంగా వంట గ్యాస్‌ పై రూ.25 పెంచారు. ఈ ధరలు తక్షణమే అమలులోకి వస్తాయని కంపెనీలు ప్రకటించాయి. ఇక పెరిగిన ధరతో ఢిల్లీలో 14.2 కిలోల డొమెస్టిక్ సిలిండర్‌ ధర రూ.794కు పెరిగింది. ఇక హైదరాబాద్‌ లో నిన్నటి దాకా సిలిండర్ ధర రూ.821.50గా ఉండగా ధర పెంపుతో రూ.846.50కి చేరింది.

మిగతా ముఖ్య నగరాల విషయానికి వస్తే బెంగుళూరులో రూ.797, చెన్నైలో రూ.810, ముంబైలో రూ.794, కోల్కతాలో రూ.820కి చేరింది. అయితే గ్యాస్ సిలిండర్ ధర పెరగడం ఫిబ్రవరి నెలలో మూడో సారి కావడం గమనార్హం. ఈ నెల 4న సిలిండర్‌పై రూ.25 పెంచగా 15న తేదీన మరో రూ.50 వడ్డించాయి. అలా మొత్తం మూడుమార్లు సిలిండర్‌పై చమురు కంపెనీలు రూ.100 బాదాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version