ఇండియాలో కరోనా విజృంభణ పీక్ స్టేజ్ కు వచ్చింది. ఈ మహమ్మారి వైరస్ ఎవరినీ వదిలేలా కనిపించడం లేదు. పేద, ధనిక అనే తేడా లేకుండా అందరికీ కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అవుతోంది. ఇక తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ కు రోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఆయన హొం ఐసోలేషన్ లోకి వెళ్లారు.
ఈ విషయాన్ని స్వయంగా.. బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్.. తన సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేశారు. “తేలికపాటి లక్షణాలు కనిపించిన తర్వాత, ఈరోజు నాకు కోవిడ్కు పాజిటివ్ అని తేలింది. ఈ మధ్య కాలంలో తన వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరు కరోనా పరీక్షలు చేయించు కువాలి.” అంటూ బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ పేర్కొన్నారు. తాను త్వరలోనే కోలుకుని మీ ముందుకు వస్తానని పేర్కొన్నారు. కాగా.. ఇప్పటికే టీమిండియా తో పాటు అండర్ -19 టీంలోనూ కరోనా కేసులు బయటపడ్డాయి. రెండు రోజుల కింద హర్భజన్ సింగ్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
After experiencing mild symptoms, I tested positive for COVID today. Requesting everyone who came into my contact to get themselves tested. #StaySafe
— Gautam Gambhir (@GautamGambhir) January 25, 2022