30 ఏళ్ల తర్వాత ‘జెంటిల్‌మెన్’ చిత్రానికి సీక్వెల్.. హీరోయిన్ ఫిక్స్.. హీరో, డైరెక్టర్ ఎవరంటే?

-

ఇండియన్ జీనియస్ డైరెక్టర్ శంకర్ తొలి చిత్రం ‘జెంటిల్‌మెన్’ అప్పట్లో సృష్టించిన ప్రభంజనం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమా ద్వారా డైరెక్టర్ శంకర్ బాగా పాపులర్ అయ్యారు. 1993లో విడుదలైన ఈ మూవీలో యాక్షన్ కింగ్ అర్జున్ హీరో కాగా, హీరోయిన్స్‌గా మధుబాల, శుభశ్రీ నటించారు. ఈ సినిమా తర్వాత వరుస భారీ చిత్రాలను నిర్మించిన కుంజుమోన్.. చాలా కాలం తర్వాత అనగా 30 ఏళ్ల తర్వాత ఆ చిత్రానికి సీక్వెల్ తీయాలని డిసైడ్ అయినట్లు ప్రకటించారు. అలా ‘జెంటిల్ మెన్ 2’ మూవీ నిర్మాణానికి అడుగులు పడగా, తాజాగా ఈ చిత్రంలో నటించే హీరోయిన్ గురించి అఫిషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చేశారు ప్రొడ్యూసర్.

 

2020లోనే ‘జెంటిల్ మెన్’ సినిమాకు సీక్వెల్ తీస్తానని ప్రొడ్యూసర్ కుంజుమోన్ ప్రకటించారు. అప్పటి నుంచి ఈ చిత్ర తారాగణం ఎవరు? నటీ నటులు ఎవరనే విషయాలపై ఆసక్తి నెలకొంది. ఈ చిత్రానికి ‘ఆర్ఆర్ఆర్’ మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం.కీరవాణి సంగీతం సమకూరుస్తున్నట్లు ఇటీవల నిర్మాత తెలిపారు. తాజాగాఈ పాన్‌ ఇండియా చిత్రంలో కథానాయికగా మాలీవుడ్‌ బ్యూటీ నయనతార చక్రవర్తిని ఎంపిక చేసినట్లు అధికారికంగా వెల్లడించారు.

మాలీవుడ్‌లో ఈ బ్యూటీని బేబీ నయనతార అని పిలుస్తుండటం విశేషం. అయితే ఈ సినిమాలో హీరోగా ఎవరు నటిస్తారు? ఎవరు డైరెక్ట్ చేస్తారనేది ఇంకా ఆసక్తికరంగా మారింది. ‘జెంటిల్ మెన్’ చిత్రానికి శంకర్ దర్శకత్వం వహించగా సీక్వెల్‌కు కూడా ఆయనే దర్శకత్వం వహించాలని సినీ ప్రియులు కోరుకుంటున్నారు. శంకర్ ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో ‘ఆర్ సీ 15’ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి కార్తీక్ సుబ్బరాజ్ స్టోరి అందించగా, శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version