భూవివాదం: కళ్ళ ముందే ముగ్గురిని ట్రాక్టర్ తో తొక్కి చంపేసాడు

-

మధ్యప్రదేశ్‌ లో దారుణం జరిగింది. హోషంగాబాద్‌ లో ఒక కుటుంబంలో ముగ్గురు సభ్యులను ట్రాక్టర్ తో తొక్కి చంపేసాడు ఒక వ్యక్తి. హోషంగాబాద్ జిల్లా సియోని మాల్వా తహసీల్‌ లో భూ వివాదం కారణంగా ట్రాక్టర్ నడుపుతున్న నిందితుడు ముగ్గురి మీద ట్రాక్టర్ ఎక్కించాడు అని పోలీసులు వెల్లడించారు. మృతుల్లో 35 ఏళ్ల రాజేంద్ర యాదువంషి, 32 ఏళ్ల కున్వర్ యాదువంషి, 11 ఏళ్ల చిన్నారిగా గుర్తించారు.

murder

ట్రాక్టర్‌ తో పాటు నిందితుడు పోలీస్‌ స్టేషన్‌ కు వెళ్లి లొంగిపోవడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది అని పోలీసులు పేర్కొన్నారు. నిందితుడిపై హత్య కేసు నమోదు చేసామని పోలీసులు మీడియాకు తెలిపారు. ఈ సంఘటన జరిగిన తర్వాత అక్కడ ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు బృందం గ్రామంలో పహారా నిర్వహిస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version