మళ్ళీ పెరిగిన బంగారం, వెండి ధరలు..!

-

గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధర మళ్ళీ ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో పసిడి ప్రియులు నిరాశ చెందుతున్నారు. హైదరాబాద్‌, విశాఖ, విజయవాడ మార్కెట్లలో బంగారం ధర రూ. 450 మేర పెరిగింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ. 54,040 కి చేరింది. అదే సమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 410 పెరుగుదలతో రూ. 49,540 కు చేరింది. పసిడి ధర పైకి కదులుతుంటే.. వెండి ధర కూడా దాని బాటలోనే నడిచింది.

కేజీ వెండి ధర రూ. 240 పెరిగింది. దీంతో ధర రూ.66,600 కి చేరింది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా బంగారం ధర పరుగులు పెడుతుంది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం రూ. 380 పెరగడంతో రూ.54,930 చేరుకుంది. అలాగే రూ.340 పెరుగుదలతో 22 క్యారెట్ల బంగారం ధర రూ.50,350 కి చేరుకుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version