ఎన్నికల ముందు కేరళ సీఎం మెడకు చుట్టుకున్న గోల్డ్ స్మగ్లింగ్ కేసు !

-

సరిగ్గా ఎన్నికల ముంగిట కేరళ సీఎం పినరయి విజయన్ మెడకు గోల్డ్ స్మగ్లింగ్ చుట్టుకుంది. గోల్డ్ స్మగ్లింగ్ తో సీఎం కూడా సంబంధాలు ఉన్నాయని ఈ కేసులో పట్టుబడిన స్వప్న సురేష్ కస్టమ్స్ అధికారులకు చెప్పినట్లు తెలుస్తోంది. ఒక్క సీఎం కు మాత్రమే కాగా కేరళ స్పీకర్ సహా ముగ్గురు మంత్రులకు కూడా ఈ స్మగ్లింగ్ లో ప్రమేయం ఉందని ఆమె వెల్లడించినట్లు తెలుస్తోంది. పినరయి విజయన్ అలానే యూ ఏ ఈ కాన్సులేట్ మధ్య ఉన్న చర్చలలో స్వప్న సురేష్ మధ్యవర్తిగా వ్యవహరించినట్లు తెలుస్తోంది.

ఈ కేసుకు సంబంధించి కేరళ స్పీకర్ కు కస్టమ్స్ అధికారులు నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని అంటున్నారు. సరిగ్గా ఎన్నికలకు ముందు ఈ ప్రక్రియ జరుగుతుండడంతో ప్రతిపక్షాలకు కస్టమ్స్ అధికారుల స్టేట్మెంట్ ఒక ఆయుధంగా మారింది. ఇక ఈ కేసులో విజయన్ కు సంబంధాలు ఉన్నాయని తేలితే కనుక కేరళ రాజకీయాలలో ఇది పెను సంచలనం అనే చెప్పాలి. చాలా రోజులుగా ఇక్కడ పాగా వేయాలని చూస్తున్న కాంగ్రెస్ బీజేపీలకు ఇది ఒక సువర్ణ అవకాశం అని చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version