బంగారం ప్రియులకు కాస్త ఊరట.. ఇవాళ బంగారం, వెండి ధరలు ఇవే!

-

న్యూఢిల్లీ: బంగారం కొనుగోలు దారులు, మహిళలకు ఇవాళ కాస్త ఊరట లభించింది. నాలుగైదు రోజులుగా పెరుగుతున్న బంగారం ధరలు తాజాగా తటస్థంగా ఉన్నాయి. దేశంలో బంగారం, వెండి ధరలు ఈ రోజు నిలకడగా ఉన్నాయి. గురువారం సాయంత్రం ఏ రేటు ఉందో శుక్రవారం కూడా అదే ధర నడుస్తోంది.

రాజధాని ఢిల్లీ నగరంతో పాటు వివిధ ప్రాంతాల్లో కూడా బంగారం, వెండి ధరల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. అయితే వెండి పలుచోట్ల హెచ్చుతగ్గులు ఉన్నాయి. తాజాగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 48,710 కాగా 22 క్యారెట్ల బంగారం రూ. 44.650గా ఉంది. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ. 48.710గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44,650గా విక్రయాలు జరుగుతున్నాయి.

ఇక వెండి ధరలోనూ మార్పు లేదు. ఈ రోజు వెండి కేజీ రూ. 74,100గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోనూ కేజీ వెండి రూ. 74,100గా కొనసాగుతోంది.

అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు ధరలపై ప్రభావం చూపుతాయని మార్కెట్‌ నిపుణులు అంటున్నారు.

వివిధ నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి…

Read more RELATED
Recommended to you

Exit mobile version