టాలీవుడ్ లో విషాదం..నటుడు గొల్లపూడి మారుతీరావు భార్య మృతి

-

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే చాలా మంది ప్రముఖులు…. కరోనా మహమ్మారి అలాగే ఇతర అనారోగ్య కారణాల వల్ల మృతి చెందారు. తాజాగా సినీ పరిశ్రమలో మరో కన్నీటి విషాదం చోటు చేసుకుంది. దివంగత నటుడు, రచయిత గొల్లపూడి మారుతి రావు సతీమణి శివ కామ సుందరి మృతిచెందారు. ఆమె వయస్సు 86 సంవత్సరాలు.

వయోభారంతో చెన్నై లో ఇవాళ ఆమె తుదిశ్వాస విడిచారు. హనుమకొండ లో జన్మించిన శివ కామ సుందరి కి గొల్లపూడి మారుతి రావు తో 1961 వ సంవత్సరంలో వివాహం జరిగింది. ఇంకా రెండు వేల పంతొమ్మిది సంవత్సరం డిసెంబర్ మాసంలో గొల్లపూడి మారుతీరావు అనారోగ్యంతో మరణించిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా గొల్లపూడి మారుతీ రావు సతీమణి శివ కామ సుందరి కూడా మృతి చెందింది. దీంతో గొల్లపూడి కుటుంబంలో విషాద చాయలు అలముకున్నాయి. ఇక ఈ విషయం తెలిసిన సినీ ప్రముఖులు ఆమె కు సంతాపం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version