తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్..

-

తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది యాజమాన్యం. ఉద్యోగులకు మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కరువు భత్యం పెంచుతున్నట్లు తెలిపింది. వచ్చే వేతనాల నుంచి 5 శాతం డిఎం చెల్లించనున్నట్లు ఆర్టీసీ స్పష్టం చేసింది.

మూల వేతనం పై ఆరు శాతం అంటే డ్రైవరు, కండక్టర్, శ్రామిక వంటి యూనిఫారం ఉద్యోగులకు కనిష్టంగా 600 రూపాయల నుంచి గరిష్ఠంగా 1500 రూపాయల వరకు భత్యం అదనంగా అందనుంది. వివిధ కేటగిరీల్లో ని… అధికారులకు 1500 రూపాయల నుంచి ఐదువేల ఐదువందల రూపాయల వరకు వేతనం అదనంగా అందం ఉంది.

ఈడీ ప్రకటన తో ఆర్టీసీపై నెలకు ఐదు కోట్ల వరకు భారం పడుతుందని అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి ఉద్యోగులు 2019లో సుదీర్ఘ సమ్మె చేయడం, తర్వాత కరోనా దెబ్బకు ఆర్టీసీ పరిస్థితి బాగా దెబ్బతిన్నది. దీంతో డిజేల చెల్లింపు ఆగిపోయింది. ఇక తాజాగా డి ఏ లను ఇస్తున్నట్లు ప్రకటించింది ఆర్టీసీ యాజమాన్యం.

Read more RELATED
Recommended to you

Exit mobile version