తెలంగాణలోని విజయ డెయిరీ రైతులకు శుభవార్త..ఆ డబ్బులు విడుదల!

-

Good news for Vijaya dairy farmers in Telangana: తెలంగాణలోని విజయ డెయిరీ రైతులకు శుభవార్త అందింది. విజయ తెలంగాణ డెయిరీకి చెందిన పాడి రైతుల పాల బిల్లుల బకాయిలు 50 కోట్లు విడుదల చేసింది రేవంత్‌ రెడ్డి సర్కార్‌. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు తెలంగాణ విజయ డైరీ ఎండీ.

Good news for Vijaya dairy farmers in Telangana

పాడి రైతులకు సంబంధించిన పాల బిల్లుల బకాయిలు మంగళ వారంలోగా చెల్లించబడతాయని ప్రకటించారు. దీనిపై తెలంగాణ డైరీ డెవలప్ మెంట్ సొసైటీ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని విజయడైరీ సహా ఇతర డైరీ పరిధిలోని పాడి రైతులకు పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని వెల్లడించారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో నెలకొన్న పాల కొరతను అధిగమించేందుకు 2022 ఫిబ్రవరి నుంచి 2024 సెప్టెంబర్ వరకు పాల సేకరణ ధరను దేశంలో ఎక్కడా లేనివిధంగా మూడు దఫాలుగా రూ.12.48 పైసలు పెంచామని తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version