చంద్రబాబు తన బాబు సొమ్మిచ్చాడా బుచ్చయ్య?

-

ప్రస్తుతం ఏపీలో ఉన్న పార్టీ పరిస్థితికి టీడీపీ నేతలకున్న ప్రస్ట్రేషన్ పీక్స్ కి చేరిందనే చెప్పాలి! అదేదో సినిమాలో పవన్ కల్యాణ్ అన్నట్లు… ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని ఏది బడితే అది వాగుతారా అన్న ప్రశ్న ఎదుర్కొంటున్నారు టీడీపీ నేతలు. ఇందులో భాగంగా.. తాజాగా ఏపీ ముఖ్యమంత్రిపై టంగ్ స్లిప్ అయ్యారు టీడీపీ సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి!

అవును.. మనం మాట్లాడుతున్న మాటలు జనం వింటున్నారన్న ఆలోచన కూడా లేదు అన్నట్లుగా ముందుకుపోతున్నారు టీడీపీ నేతలు. ఇందులో భాగంగా… “తనబాబు సొమ్మేదో ఇచ్చినట్లు పాఠ్యపుస్తకాల్లో పార్టీ రంగులు కనిపించేలా పెట్టారు” అని మాట్లాడుతున్నారు బుచ్చయ్య చౌదరి! దీంతో మైకులకు పనిచెప్పారు వైకాపా నేతలు!

అసలు రంగుల గురించి మాట్లాడే హక్కు టీడీపీ నేతలకుందా అని మొదలుపెట్టారు వైకాపా నేతలు! స్మశానాలు, కాలవపక్కనున్న కొబ్బరి చెట్లు మొదలు అన్న క్యాంటిన్లు, ఆర్టీసీ బస్సులు, రేషన్ బియ్యం బ్యాగుల నుంచి దేన్నీ వదలకుండా పసుపు రంగుతో నింపేశారని ఎద్దేవా చేశారు. నాడు పసుపు రంగు అలా నింపేశారంటే… నాడు చంద్రబాబు తన బాబు సొమ్ముతో వాటిని ప్రజలు అందించారా అని ప్రశ్నిస్తున్నారు!

మనకింద అంత నలుపు పెట్టుకుని ఎదుటివాడిపై పడటం ఎందుకు.. రివర్స్ వాయింపు తెచ్చుకోవడం ఎందుకో.. టీడీపీ నేతలకే తెలియాలనేది నెటిజన్ల ప్రశ్న కం సూచన!!

-CH Raja

Read more RELATED
Recommended to you

Exit mobile version