రాజ్య‌స‌భ‌లో బీజేపీ విప్‌గా జీవీఎల్ న‌ర‌సింహారావు

-

తెలుగు నేల‌కు చెందిన సీనియ‌ర్ రాజ‌కీయ‌వేత్త, బీజేపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు జీవీఎల్ న‌ర‌సింహారావును మ‌రో కీల‌క ప‌ద‌వి వ‌రించింది. రాజ్య‌స‌భ‌లో బీజేపీ విప్‌గా ఆయ‌న‌ను నియ‌మిస్తూ బీజేపీ అధిష్టానం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా రాష్ట్రాల‌కు చెందిన పార్టీ స‌భ్యుల‌ను స‌మ‌న్వ‌యం చేసుకునేందుకు పార్టీ నేత‌ల‌కు విప్ ప‌ద‌వుల‌ను కేటాయిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో భాగంగానే ద‌క్షిణాది రాష్ట్రాలకు చెందిన పార్టీ స‌భ్యుల‌ను స‌మ‌న్వ‌యం చేసుకునేందుకు జీవీఎల్ న‌ర‌సింహారావును బీజేపీ విప్‌గా నియ‌మించింది.

ఈ హోదాలో జీవీఎల్‌… ఏపీ, తెలంగాణ‌, క‌ర్ణాట‌క‌, త‌మిళ‌నాడు రాష్ట్రాల‌కు చెందిన పార్టీ స‌భ్యుల‌ను స‌మ‌న్వ‌యం చేసే బాధ్య‌త‌ల‌ను చేప‌ట్ట‌నున్నారు. ఇదిలా ఉంటే.. గత సోమవారం నుంచి వర్షాకాలం పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం జీవీఎల్‌ నరసింహరావు పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యేందుకు ఢిల్లీలో ఉన్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version