హరే కృష్ణ ఆలయ నిర్మాణానికి రూ. 25 కోట్లు

-

హరే కృష్ణ ఆలయ నిర్మాణానికి తెలంగాణ సీఎం కేసీఆర్ భారీ సాయం ప్రకటించారు. హరే కృష్ణ ఆలయ నిర్మాణానికి రూ. 25 కోట్లు ప్రకటించారు తెలంగాణ సీఎం కేసీఆర్. హైదరాబాద్ లోని కోకాపేటలో రాష్ట్ర ప్రభుత్వ సహకారం, శ్రీకృష్ణ గో సేవా మండలి విరాళంతో నిర్మించిన హరే కృష్ణ హెరిటేజ్ టవర్ కు సీఎం కేసీఆర్ సోమవారం శంకుస్థాపన చేశారు.

ఈ కార్యక్రమానికి హాజరైన సీఎం కేసీఆర్ కి వేద పండితులు ఘన  స్వా గతం పలికారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఇంతటి ఆధ్యాత్మిక వాతావరణం లో మీ మధ్యన ఉన్నందున సంతోషంగా ఉందన్నారు.హరే కృష్ణ ఫౌండేషన్ అక్షయపాత్ర ద్వారా అన్నదానం చేయడం గొప్ప విషయం అని.. హైదరాబాద్ లో ధనవంతులు కూడా 5 రూపాయల భోజనం తింటున్నారని చెప్పారు. కరోనా సమయం లో హరే కృష్ణ ఫౌండేషన్ సేవలను ఆయన కొనియాడారు. ఆలయ నిర్మాణానికి 25 కోట్లు ఇస్తామని ప్రకటించారు సీఎం కేసీఆర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version