రేవంత్ రెడ్డి భద్రత పిటిషన్ పై హైకోర్టులో విచారణ వాయిదా

-

టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి తెలంగాణలో హాత్ సే హాత్ జోడో పాదయాత్ర చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన పాదయాత్రకు అదనపు భద్రత కల్పించాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రేవంత్ రెడ్డి పిటిషన్ పై నేడు హైకోర్టు విచారణ చేపట్టింది. రేవంత్ రెడ్డి పాదయాత్రకు ప్రభుత్వం తగిన విధంగా భద్రత కల్పిస్తుందని ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదించారు.

రేవంత్ పాదయాత్రకు గట్టి బందోబస్తు కల్పించాలని డిజి ఇప్పటికే ఎస్పీలకు లేఖ పంపారని కూడా కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అయితే డిజిపి ఆదేశాలకు అనుగుణంగా రేవంత్ రెడ్డి పాదయాత్రకు భద్రత ఇస్తున్నారో లేదో చెప్పాలని రేవంత్ రెడ్డి తరపు న్యాయవాదిని హైకోర్టు ఆదేశించింది. ఈ పిటిషన్ పై విచారణ సోమవారానికి వాయిదా వేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version